Loksabha Elections 2024 : ఐదు కిలోల ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఐదు కిలోల బియ్యం, గోధుమలతో మీ భవిష్యత్ మెరుగుపడదు..రేషన్తో మీరు ఆత్మనిర్భర్ కాలేరని వ్యాఖ్యానించారు. మీకు ఉద్యోగం కావాలా..ఐదు కిలోల రేషన్ కావాలా అంటే మీరు కచ్చితంగా ఉపాధినే కోరుకుంటారని ఆమె పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ గురువారం యూపీలోని రాయ్బరేలిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. ఉపాధి లభిస్తేనే మీరు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. మీరు ఒకరిపై ఆధారపడేలా విధానాలు రూపొందిస్తున్న రాజకీయ పార్టీ గురించి అర్ధం చేసుకోవాలని అన్నారు.
అలాంటి పార్టీ సిద్ధాంతం సరైంది కాదని కాషాయ పార్టీపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. పేదలు స్వయం సమృద్ధి సాధించేలా వారికి ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
Read More :
Kerala Governor | అయోధ్య రాముడి ముందు ప్రణమిల్లిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్.. VIDEO