న్యూఢిల్లీ: పరిస్థితి చేయి దాటి పోయిందని, ప్రజలంతా ఇండ్లలోనే సేఫ్గా ఉండాలని భారతీయులను బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా అభ్యర్థించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రజలను అభ్యర్థిస్తూ.. అత్యవసరమైతే తప్ప దయచేసి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. రెండు నెలలుగా ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోనందువల్లే మళ్లీ కరోనా విజృంభించిందని అన్నారు.
‘దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను వార్తల్లో చూస్తుంటే భయంగా ఉంది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తున్నది. దయ చేసి అందరూ ఇండ్లలోనే ఉండాలని అభ్యర్థిస్తున్నా అని పేర్కొన్నారు.
‘మీ కోసం, మీ కుటుంబం కోసం, స్నేహితులు, పక్కింటి వాళ్లు, బంధువులు, మన ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం దీన్ని పాటించండి. బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్ ధరించండి. పరిస్థితిని అర్థం చేసుకుని మీ చుట్టు పక్కల వారికి సాయం చేయండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పక వ్యాక్సిన్ తీసుకోండి. మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన వైద్య రంగంపై ఒత్తిడిని తగ్గిస్తాయి’ అని ట్వీట్ చేశారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు