Droupadi Murmu | ఆర్థిక సంస్కరణల రూపకర్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నివాళులర్పించారు. మన్మోహన్ నివాసానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. అక్కడ మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా మన్మోహన్కు నివాళులర్పించారు.
Delhi | President Droupadi Murmu visited the residence of the former Prime Minister of India Dr Manmohan Singh and paid last respects to him. She also offered her condolences to his family members
(Pic source – President Droupadi Murmu’s twitter handle) pic.twitter.com/SXnmFx5gHN
— ANI (@ANI) December 27, 2024
గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్కు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలువురు నేతలు మన్మోహన్కు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
Also Read..
Manmohan Singh | మన్మోహన్ సింగ్కు నివాళులర్పించిన సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక
Manmohan Singh | దేశానికి దశదిశ చూపిన ప్రధాని.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనదే..!
Manmohan Singh | భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్.. 1991 బడ్జెట్ ఓ గేమ్ ఛేంజర్
PM Modi | మన్మోహన్ సింగ్కు మోదీ నివాళులు