కోల్కతా: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ఆరో దశ పోలింగ్లో కూడా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు కొనసాగాయి. బీజేపీ అభ్యర్థితోపాటు పలువురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. జార్గ్రామ్లో బీజేపీ అభ్యర్థి ప్రణత్ టుడు కాన్వాయ్పై దాడి జరిగింది. గర్బెటాలోని పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ప్రణత్ టుడు ఆ పోలింగ్ బూత్ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా కొంత మంది వ్యక్తులు బీజేపీ అభ్యర్థిపై రాళ్లు రువ్వారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘర్షణలో బీజేపీ అభ్యర్థి కారు కూడా ధ్వంసమైంది. అయితే గర్బెటాలోని పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో వేచి ఉన్న మహిళపై బీజేపీ అభ్యర్థి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసినట్లు టీఎంసీ ఆరోపించింది.
మరోవైపు బెంగాల్లోని ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఘటల్, కంఠిలో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘటల్లో టీఎంసీ గూండాలు ఓటింగ్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించినట్లు బీజేపీ అభ్యర్థి హిరాన్ ఛటర్జీ ఆరోపించారు.
Mamata Banerjee is murdering democracy in Bengal. Now, TMC goons attack BJP’s Jhargram (a Tribal seat) candidate and ABP Ananda’s crew. Despite attempts to preclude people from casting vote, West Bengal has one of the highest voter turnout across the country. People are voting to… pic.twitter.com/ZMdTPhxiYw
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 25, 2024
#WATCH | West Bengal: BJP candidate from Ghatal Lok Sabha seat, Hiran Chatterjee was stopped by a group of protestors in Ghatal, Paschim Medinipur. pic.twitter.com/eQwsuSpVxw
— ANI (@ANI) May 25, 2024