ఖమ్మం, ఏప్రిల్ 19: కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మంత్రి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని 19వ డివిజన్లో ఆదివారం టీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రతి గడప గడపకూ తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ గాజుల వసంత, పరమేశ్, రామ్మూర్తి, వీరబాబు, రామరాజు, నాగేశ్వరారవు, సహదేవుడు, కరుణ, రాధిక, విజయ, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.
2వ డివిజన్లో..
నగరంలోని 2వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నర్రా ఎల్లయ్య ఆధ్వర్యంలో టీడీపీ 2వ డివిజన్ అధ్యక్షుడు కొట్టే నాగేంద్రబాబుతో పాటు 150 మంది ఆదివారం మంత్రి అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.టీఆర్ఎస్లో చేరిన వారిలో నాయకులు తాటి వీరభద్రం, చింతపల్లి నాగరాజు, యలగందుల సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సంఘం నాయకుడు తదితరులు ఉన్నారు.
200 మంది చేరిక..
ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు బోడేపూడి విఠల్రావు, మూల్ల ప్రసాద్తో పాటు 200 మంది కార్యకర్తలు ఆదివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోడేపూడి విఠల్రావు దివంగత టీఆర్ఎస్ నాయకుడు బోడేపూడి రమేశ్బాబు సోదరుడు. ఈయన గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి, సంక్షమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు విఠల్రావు తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసి చేరుతున్నట్లు చెప్పారు.
టీఆర్ఎస్లోకి చేరికలు..
ఖమ్మం కార్పొరేషన్ 47వ డివిజన్ నాయకుడు మాటేటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి 100 మంది ఆదివారం మంత్రి అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు సుంకర శ్రీనివాస్రెడ్డి, నజీర్, టీడీపీ నాయకుడు, తెలంగాణ నూర్ బాషా దూదేకుల సంఘం నగర అధ్యక్షుడు డాక్టర్ ఎస్కే రసూల్, ఎస్.జాకీర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి