PM Modi : మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రహదారులు, మౌలిక రంగ వృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
పేదల సంక్షేమం కోసం పధకాలు అమలు చేస్తూనే మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నామని, ఇది డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమైందని ప్రధాని వివరించారు. మంగళవారం వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047 కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ పదేండ్ల కిందట బడ్జెట్లో మౌలిక రంగానికి కేవలం రూ. 2 లక్షల కోట్ల కంటే తక్కువ కేటాయింపులు ఉండగా, ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాల రంగానికి రూ. 11 లక్షల కోట్లు కేటాయించామని గుర్తుచేశారు.
గోవాలో పలు ప్రభుత్వ పధకాలు పూర్తిగా సంతృప్తికర దశలో అమలవుతున్నాయని చెప్పారు. సంతృప్త స్ధాయిలో సేవలు, పధకాలు అందించడమే గోవాకు, దేశానికి మోదీ ఇచ్చే గ్యారంటీ అని ప్రధాని స్పష్టం చేశారు. గోవాలో టూరిజం రంగ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు.
Read More :
Actor Vishal | విజయ్ బాటలో విశాల్.. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన..?