Lok Sabha Polls 2024 : కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారుతోందని, గతంలో 400 స్ధానాల్లో గెలిచిన ఆపార్టీకి ప్రస్తుతం 300 స్ధానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్ధిరతకు మారుపేరని వ్యాఖ్యానించారు. రాజస్ధాన్లోని జలోర్లో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన పాపాలకు దేశ ప్రజలు ఆ పార్టీని శిక్షిస్తున్నారని అన్నారు.
మీరు ప్రతిసారీ బీజేపీకి ఆశీస్సులు ఇచ్చిన మాదిరిగా ఈ ఎన్నికల్లోని కాషాయ పార్టీకి అండగా నిలవాలని కోరారు. తొలి దశ పోలింగ్లో రాజస్ధాన్లోని పలు నియోజకవర్గాలు కాంగ్రెస్కు గుణపాఠం నేర్పాయని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ స్ధిరమైన ప్రభుత్వాన్ని అందించలేదని రాజస్ధాన్ ప్రజలకు తెలుసునని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో నడిచేదని, 2014కు ముందున్న పరిస్ధితులు తిరిగి రావాలని దేశం కోరుకోవడం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు రాజ్యసభ మార్గాన్ని ఎంచుకున్నారని సోనియా గాంధీ పేరు ప్రస్తావించకుండా ప్రధాని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలుసుకున్న నేతలు రేసు నుంచి తప్పుకుని రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు.
Read More :
Compex Fixx | దీంతో ఇంటివద్దే బాడీ మసాజ్ చేసుకోవచ్చు..