Ayodhya Ram Mandir | రామ్లల్లా ప్రాణప్రతిష్టకు ముందు శ్రీరామ జన్మభూమి ఆలయం (Ayodhya Ram Mandir)పై రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంప్లను (postage stamps) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు విడుదల చేశారు. దీంతోపాటు రాముడి చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించారు.
ప్రధాని మోదీ మొత్తం ఆరు తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరి ఉన్నాయి. అదేవిధంగా స్టాంపులతో కూడిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ 48 పేజీల పుస్తకంలో యూఎస్, సింగపూర్, కెనడా, కంబోడియా సహా 20 కంటే ఎక్కువ దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. స్టాంపుల విడుదల సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సందేశం కూడా ఇచ్చారు.
‘ఈ రోజు శ్రీరామమందిరం ప్రాణ ప్రతిష్టా అభియాన్ నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి మందిర్పై రూపొందించిన ఆరు స్మారక పోస్టల్ స్టాంప్స్, ఆల్బమ్ విడుదలైంది. దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
#WATCH | Prime Minister Narendra Modi says “Today, I got the opportunity to join another event organised by Shri Ram Mandir Pran Pratishtha Abhiyan. Today, 6 Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and an album of stamps issued on Lord Ram around the world have… https://t.co/cgSOT6MGZy pic.twitter.com/QmdB0PrGrL
— ANI (@ANI) January 18, 2024
Also Read..
Sivamani | ఎయిర్పోర్ట్లో లగేజీ ఆలస్యం.. కన్వేయర్ బెల్ట్పై డ్రమ్స్ శివమణి ప్రదర్శన.. వీడియో
Ayodhya: గర్భగుడిలోకి రాముడి విగ్రహం..
Sachin Tendulkar | సచిన్ డీప్ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు