Joe Biden | వచ్చే ఏడాది జనవరి 26న జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు ఆహ్వానం అందింది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో బైడెన్ను ప్రధాని మోదీ (PM Modi) ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, భారత్ ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ దేశాల నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా భారత్ ఆహ్వానాన్ని అంగీకరించి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు బైడెన్ కూడా మోదీ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా రెండో అధ్యక్షుడిగా బైడెన్ నిలుస్తారు.
Also Read..
Dengue | కడుపులో బిడ్డకు డెంగ్యూ.. కోల్కతాలో అతి అరుదైన కేసు నమోదు
Women’s Reservation Bill | ఒంటి చేత్తో దేశాలను పాలిస్తున్న మహిళా నాయకులు వీళ్లే..!