PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ప్రస్తుతం లక్షద్వీప్ (Lakshadweep) పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను మోదీ ఆస్వాదిస్తున్నారు. మరోవైపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం తన బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టి సముద్రం ఒడ్డున సరదాగా సమయాన్ని గడిపారు. అక్కడ బీచ్ (beach)లో కుర్చీ వేసుకొని కాసేపు సేద తీరారు. ఈ సందర్భంగా సముద్రంలో సాహసోపేత డైవింగ్ చేశారు.
ముఖానికి ట్యూబ్, డైవింగ్ మాస్క్ను ధరించి సముద్రంలోపల ఈత కొట్టారు. ఈ డైవింగ్ను ‘స్నోర్కెలింగ్’ (snorkeling) అని అంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ.. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయన్నారు. సాహసాలు చేయాలనుకునేవారు.. తమ లిస్ట్లో ఈ లక్షద్వీప్ను కూడా చేర్చుకోండి అంటూ సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
— Narendra Modi (@narendramodi) January 4, 2024
Also Read..
Ayodhya Ram Mandir | అయోధ్యలోని భవ్య రామ మందిరం ప్రత్యేకతలు..
JN.1 | 12 రాష్ట్రాలకు పాకిన కరోనా కొత్త వేరియంట్.. 541కి పెరిగిన జేఎన్.1 కేసులు
Jitendra Awhad | శ్రీరాముడు మాంసాహారి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు