JN.1 | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ తరహా కేసులు 12 రాష్ట్రాలకు పాకాయి. జనవరి 3వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 541కి పెరిగాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 775 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,78,047) చేరింది. నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యారు. కేరళలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 5,33,373కి ఎగబాకింది.
Also Read..
Arvind Kejriwal | విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకు కుట్ర.. ఈడీ సమన్లపై కేజ్రీవాల్
KCR | కేసీఆర్ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్
Amala Paul | తల్లికాబోతున్న అమలాపాల్.. బేబీబంప్ ఫొటోలు షేర్ చేసిన నటి