Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇచ్చిన సమన్లపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా స్పందించారు. ఈడీ ఇచ్చిన నోటీసులు లీగల్గా చెల్లవని తేల్చి చెప్పారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేయకుండా తనను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈడీ పంపిన సమన్లను ఆయన తీవ్రంగా ఖండించారు.
‘నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం నన్ను అడ్డుకోడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. మద్యం పాలసీలో అవినీతి జరగలేదన్నది నిజం. కానీ బీజేపీ మాత్రం ఏదో జరిగిపోయిందని చెప్పి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది. నా నిజాయితీయే నాకున్న ఆస్తి. దాన్ని వారు దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈడీ పంపిన సమన్లు చెల్లవని ఇప్పటికే మా లాయర్లు చెప్పారు. బీజేపీ లక్ష్యం నన్ను విచారించడం కాదు.. లోక్సభ ఎన్నికల ముందు ప్రచారం చేయకుండా కట్టడి చేసేందుకే ఇదంతా. విచారణ సాకుతో నన్ను పిలిచి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.
#WATCH | On ED summons in liquor police case, Delhi CM & AAP leader Arvind Kejriwal says, “The truth is that there was no corruption. BJP wants to arrest me. My biggest asset is my honesty & they want to dent it. My lawyers have told me that summons sent to me are illegal. BJP’s… pic.twitter.com/jLWmkZ2mxj
— ANI (@ANI) January 4, 2024
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. ఈ క్రమంలోనే ఈడీ మూడోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం.. బుధవారం కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ముచ్చటగా మూడోసారి కూడా ఆ విచారణకు ఆప్ అధినేత గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఈడీ సంస్థకు లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ను ఈడీ అధికారులు నేడు అరెస్ట్ చేయనున్నారంటూ ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఈడీ కొట్టిపారేసింది.
Also Read..
KCR | కేసీఆర్ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్
Amala Paul | తల్లికాబోతున్న అమలాపాల్.. బేబీబంప్ ఫొటోలు షేర్ చేసిన నటి
Coronavirus | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 760 కొత్త కేసులు