Jitendra Awhad | కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే శ్రీరాముడిని (Lord Ram) ఉద్దేశించి ఎన్సీపీ నేత (NCP leader ) జితేంద్ర అవద్ (Jitendra Awhad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు శాఖాహారి కాదని, ఆయన వేటాడి మాంసాన్ని తినేవారని వ్యాఖ్యానించారు (non vegetarian). మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రాముడు బహుజనులకు (Bahujan) చెందినవాడు. అతను జంతువులను వేటాడి తినేవాడు. రాముడిని ఉదాహరణగా చూపి ప్రతి ఒక్కరినీ శాఖాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, శ్రీరాముడు శాఖాహారుడు కాదు. అతను మాంసాహారుడు. 14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు.. వెజిటేరియన్ కోసం ఎక్కడికి వెళ్తాడు..? అవునా..? కాదా..? నేను చెప్పినదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు.
అవద్ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవద్పై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రామ భక్తులు, బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు ఎన్సీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో దిగివచ్చిన అవద్ క్షమాపణలు కోరారు. ఏ విషయం గురించీ తాను తొందరపడి మాట్లాడనని, రామాయణంలో ఉన్నదే చెప్పానంటూ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వేడుకున్నారు.
Also Read..
Amala Paul | తల్లికాబోతున్న అమలాపాల్.. బేబీబంప్ ఫొటోలు షేర్ చేసిన నటి
Arvind Kejriwal | విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకు కుట్ర.. ఈడీ సమన్లపై కేజ్రీవాల్
Coronavirus | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 760 కొత్త కేసులు