TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. చివరికి ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో కమలం పార్టీ కాస్త పుంజుకుంది. ఎన్నడూ లేనివిధంగా.. ఏకంగా 8 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేశారు.
‘నా ప్రియమైన తెలంగాణ సోదరసోదరీమణులారా.. మీరు బీజేపీ పార్టీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది. ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని నేను అభినందిస్తున్నాను’ అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ఇక ఇదే ట్వీట్ను యాజిటీజ్గా అమిత్ షా కూడా పోస్టు చేశారు.
ప్రియమైన తెలంగాణా సోదరసోదరీమణులారా,
మీరు @BJP4India కి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, మా మద్దతు పెరుగుతూనే ఉంది, ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది.
తెలంగాణతో మా బంధం విడదీయరానిది, ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం.
ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార… pic.twitter.com/I7xHVcUctZ
— Amit Shah (Parody) (@Motabhai012) December 3, 2023
Also Read..
Telangana Assembly Elections | బిగ్ బ్రేకింగ్.. డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్
Telangana Assembly Elections | ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వని తెలంగాణ ప్రజలు
Telangana Assembly Elections | ఫ్యామిలీ పాలిటిక్స్లో సరికొత్త ట్విస్ట్లు..