Death Threat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar)లకు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి వారిని చంపుతామంటూ బెదిరించాడు (death threat). దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు కాలర్ ను పట్టుకునే పనిలో పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బుధవారం ఉదయం 10:46 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ వచ్చింది. రూ.10 కోట్లు ఇవ్వకపోతే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను చంపేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. నాంగ్లోయీ ప్రాంతం నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం 10:54 గంటల ప్రాంతంలో అదే వ్యక్తి మరోసారి ఫోన్ చేశాడు. ఈసారి రూ.2 కోట్లు ఇవ్వకుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చంపుతానంటూ బెదిరించాడు. ఈసారి ఆ ఫోన్ కాల్ పశ్చిమ విహార్ (ఈస్ట్) ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు పశ్చిమ విహార్ ఈస్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కార్పెంటర్ గా పనిచేసే మథిపూర్ నివాసి సుధీర్ వర్మగా గుర్తించినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరేంద్ర సింగ్ తెలిపారు.
Also Read..
Sobhita Dhulipala | ఆ వార్తలు నన్నేమాత్రం బాధించవు.. కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత
Uttar Pradesh | ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు.. ఆపై వరుడి తమ్ముడితో వివాహం
Honduras women Jail | హోండురస్ జైలులో ఘర్షణ.. 41 మంది మహిళా ఖైదీలు మృతి