Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ (Ghazipur) జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరుడికి దేశ ప్రధాన మంత్రి పేరు తెలియదన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకుందో వధువు. అనంతరం ఊహించని రీతిలో వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
శివశంకర్ అనే వ్యక్తికి రంజన అనే యువతితో ఈనెల 11న వివాహం జరిగింది. పెళ్లైన మరుసటి రోజు అంటే జూన్ 12వ తేదీన ఉదయం వధువు ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శివశంకర్ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఈ క్రమంలో దేశ ప్రధాని ఎవరు అని మరదలు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు శివశంకర్ సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడే ఉన్న బంధువులంతా అతడిని హేళన చేశారు. ఇదంతా చూసిన వధువు రంజన అవమానంగా భావించింది.దీంతో శివశంకర్ తో తన పెళ్లిన రద్దు చేసుకొని.. అతడి తమ్ముడు అనంత్ ను అక్కడికక్కడే మనువాడింది.
Also Read..
MLA | పబ్లిక్లో ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే
Train | 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలు నుంచి జారిపడ్డ యువకుడు
Yoga Day | దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న రాష్ట్రపతి