Train | ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ (Shahjahanpur) రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ (Patliputra Express) రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రైలు నుంచి ఓ యువకుడు ఒక్కసారిగా జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్ ఫాం మీద అలాగే జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. అంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కింద పడ్డప్పటికీ ఆ యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
यूपी के शाहजहांपुर में 110 की स्पीड में एक्सप्रेस ट्रेन से गिरा युवक, 100 मीटर तक प्लेट फॉर्म पर फिसलता चला गया और फिर खडा हो गया @Sarvesh68470098 @skattri12 @ajaibhadauriya @hope_india2014 @akkusingeroffic @ pic.twitter.com/nSSKtVgiwn
— Shívαní jααt jσurnαlíѕt (@SHIVANIJAAT6) June 20, 2023
Also Read..
Yoga Day | దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న రాష్ట్రపతి
Elon Musk: వీలైనంత త్వరగా ఇండియాకు టెస్లా కంపెనీ: ఎలన్ మస్క్
Ayodhya Ramamandiram | జనవరి 25 నుంచి అయోధ్య రాముడి దర్శనం