న్యూయార్క్: భారత్లో టెస్లా కంపెనీ ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం ఉన్నట్లు ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్(Elon Musk) అన్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగానే టెస్లా సంస్థను ఇండియాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత భవిష్యత్తుపై తనకు నమ్మకం ఉందని, ప్రపంచదేశాల్లో ఆ దేశానికి ప్రత్యేక స్థానం ఉందని మస్క్ అన్నారు. భారతీయ మార్కెట్పై ఆసక్తి ఉందా అని మస్క్ను ద వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రశ్నించింది. దానికి ఆయన అవును అనే సమాధానం ఇచ్చారు. ఎనర్జీ నుంచి ఆధ్మాత్మికత వరకు అనేక అంశాలపై మస్క్తో చర్చించానని ప్రధాని తన ట్వీట్లో తెలిపారు. ఆ ట్వీట్కు మస్క్ రిప్లై ఇచ్చారు. వచ్చే ఏడాది ఇండియాలో పర్యటించనున్నట్లు మస్క్ వెల్లడించారు.
It was an honor to meet again
— Elon Musk (@elonmusk) June 20, 2023