PM Modi : రాజస్ధాన్లోని బార్మర్లో శుక్రవారం ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చొరబాటుదార్లను స్వాగతించిందని, రాజస్ధాన్లో రామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరిన అల్లరిమూకలకు ఆ పార్టీ ఆశ్రయం కల్పించిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ ముద్రతో ముందుకొచ్చిందని మండిపడ్డారు.
దేశ విభజనకు కారణమైన ముస్లిం లీగ్ ముద్ర కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఉందని ఆరోపించారు. ఇండియా కూటమిలో మరో పార్టీ భారత అణ్వాయుధాలను తాము ధ్వంసం చేస్తామని మేనిఫెస్టోలో ప్రమాదకర డిక్లరేషన్ను పొందుపరిచిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మన పొరుగున రెండు దేశాలు అణ్వాయుధాలను సమీకరిస్తే మనం మాత్రం మన అణ్వాయుధాలను ధ్వంసం చేయాలా అని ప్రశ్నించారు.
భారత్ను శక్తిహీనంగా తయారుచేయాలని కూటమి పార్టీలు కోరుకుంటున్నాయా అని ప్రధాని మోదీ నిలదీశారు. ఇక ఈ ర్యాలీలో రాజస్ధాన్ సీఎం భజన్లాల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో మేనిఫెస్టోలో 45 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. రాజస్ధాన్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
Read More :
Evening Walk | సాయంత్రం వేళ వ్యాయామం.. వారికి ఎంతో ప్రయోజనం