ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు టీకా తీసుకోవడానికి క్యూకడుతున్నారు. అయితే వ్యాక్సిన్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉండటంతో రాష్ట్రంలో ఏదో ఒకచోట టీకా కేంద్రాలు మూతపడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ నిల్వలు అడుగంటడంతో ముంబైలోని బీకేసీ జంబో వ్యాక్సినేషన్ కేంద్రం ఈ రోజు మూసి ఉంటుందని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. వ్యాక్సిన్లు రాగానే వీలైనంత తొందరగా కేంద్రాన్ని తెరుస్తామని చెప్పింది. అయినప్పటికే ఉదయాన్నే జనాలు వ్యాక్సినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. గేటుకు నోస్టాక్ బోర్డు పెట్టినప్పటికీ ప్రజలు టీకా కోసం లైన్లలో నించుంటున్నారు.
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 66,358 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,10,085కు చేరింది. ఇందులో 6,74,358 కేసులు యాక్టివ్గా ఉండగా, 36,69,548 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 66,179 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 895 మంది కరోనా వల్ల మృతిచెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..