Chath Pooja | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఛఠ్ పూజ (Chath Pooja) సందర్భంగా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన ప్రజలు రైలు రద్దు (cancels festival service) కారణంగా ఆగ్రహించారు. ఈ కోపంతో రైలుపై రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేశారు (People throw stones at train). ఈ ఘటన ఫతేఘర్ సాహిబ్ (Fatehgarh Sahib) జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తర భారతీయులు ఛఠ్ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటారన్న విషయం తెలిసిందే. ఏటా ఈ పూజను బీహార్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నాలుగు రోజులపాటూ జరుపుకునే ఈ వేడుకకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా సొంతూళ్లకు పయనమవుతుంటారు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది. అయితే, పంజాబ్లోని ప్రజలు పండుగ కోసం ఇటీవలే ఇంటికి బయలు దేరారు. ఈ క్రమంలో ఫతేఘర్ జంక్షన్కు వచ్చి ప్రత్యేక రైలు కోసం వేచి ఉన్నారు.
అయితే, అనుకోకుండా సిర్హింద్ జంక్షన్ (Sirhind Railway station) నుంచి గోరఖ్పూర్ జంక్షన్కు బయలుదేరే సహర్సా స్పెషల్ ఫేర్ ఫెస్టివ్ రైలు (Saharsa Special Fare Festival Train)ను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సిర్హింద్ రైల్వే స్టేషన్లో మరో రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Chaos ensues, and passengers pelted stones at another train at Sirhind Railway station in anger, as the Saharsa Special Fare Festival Train, departing from Sirhind Junction to Gorakhpur Junction, has been cancelled. The passengers were supposed to travel home to celebrate Chath… pic.twitter.com/NuoUh2DvXv
— Gagandeep Singh (@Gagan4344) November 14, 2023
Also Read..
Namitha | చీటింగ్ కేసులో నటి నమిత భర్తకు సమన్లు
Chiranjeevi | చరణ్ దివాళీ పార్టీలో చిరంజీవి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
Xi Jinping | ఆరేళ్ల తర్వాత తొలిసారి అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్