Ram Temple | శ్రీరామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) అయోధ్యాపురిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వంద ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది భారతీయుల కల సాకారమవుతూ.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరాడు. ఇక నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు.
రాములోరిని దర్శించుకునేందుకు ఉదయం 3 గంటలకే మందిరం వద్దకు చేరుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీని అదుపుచేసందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో రాములోరి దర్శనానికి సమయం పడుతుండటంతో భక్తులు సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ (security) సిబ్బందిని తోసుకుంటూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Uttar Pradesh: People break through security at Shri Ram Janmabhoomi Temple in Ayodhya.
The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/vYEANsXQkP
— ANI (@ANI) January 23, 2024
Also Read..
Amitabh Bachchan | రామచంద్రకీ జై.. బాలరాముడి దర్శన ఫొటోలను షేర్ చేసిన బిగ్బీ
Zomato | ప్రాణ ప్రతిష్ట వేళ.. నాన్వెజ్ను నిషేధించిన జొమాటో
IndiGo | కోల్కతా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. జైపూర్కు మళ్లింపు