Amitabh Bachchan | కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. వందల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం వెలసింది. భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో బాలరాముడు ఎట్టకేలకు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం 12:29 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు ప్రధాని మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో పులకించిపోయారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రామచంద్రకీ జై’ (Ramchandra Ki Jai) అంటూ దివ్యమైన రూపంలో గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకుంటున్న ఫొటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
T 4899 – बोल सिया पति रामचंद्र की जय 🚩 pic.twitter.com/6S8rhQD8Uk
— Amitabh Bachchan (@SrBachchan) January 22, 2024
Also Read..
Ayodhya Ram Mandir | అయోధ్య రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. వీడియో
Ram Lalla | బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ ఓ అద్భుతం.. విదేశీ క్రికెటర్ల పోస్టులు వైరల్
Kohli Duplicate: అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం.. వీడియో