న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ డూప్లికేట్(Kohli Duplicate) ఒకరు సోమవారం అయోధ్యలో సందడి చేశాడు. అచ్చం కోహ్లీ లాగే ఉన్న ఓ వ్యక్తి.. టీమిండియా దస్తుల్లో కనిపించాడు. దీంతో అయోధ్య కార్యక్రమానికి వచ్చిన చాలా మంది అతనితో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. వాస్తవానికి అయోధ్య వేడుకకు రావాలని క్రికెటర్ కోహ్లీని ఆహ్వానించారు. కానీ అతను వెళ్లలేదు. అయితే డూప్లికేట్ కోహ్లీ కనిపించడంతో జనం అతని చుట్టే తిరిగారు. సెల్ఫీ ఫోటోలు, వీడియోల కోసం ప్రయత్నించారు. ఆ వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది.
మరో వైపు క్రికెటర్ కోహ్లీ.. ఇంగ్లండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరం కానున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల ఆ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్లు అతను ప్రకటించాడు. అయితే ఏ కారణం చేత అతను టెస్టులకు దూరం అయ్యాడన్న విషయాన్ని బీసీసీఐ వెల్లడించలేదు. కానీ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఈనెల 25వ తేదీ నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే.
Duplicate Virat Kohli at Ayodhya.
– People going crazy after seeing Duplicate Virat Kohli. [Piyush Rai]pic.twitter.com/eJeWkr5TBJ
— Johns. (@CricCrazyJohns) January 22, 2024