Ram Lalla : అయోధ్యలో కొత్తగా కట్టిన ఆలయంలో బాల రాముడి(Ram Lalla) ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తలపించింది. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు, క్రికెట్ దిగ్గజాలు ఈ వేడుకను చూసి తరించారు. బాల రాముడిని దర్శించుకొని పులకించిపోయారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మహోత్సవం అద్భుతమంటూ విదేశీ క్రికెటర్లు పోస్ట్లు పెట్టారు.
పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా(Danish Kaneria) ఎక్స్ ఖాతాలో శ్రీరాముడి విగ్రహం ఫొటోతో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి ‘వందల ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. వాగ్దానం ముగిసింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యింది’ అని రాసుకొచ్చాడు.
सदियों को प्रतीक्षा पूर्ण हुई, प्रतिज्ञा पूर्ण हुई, प्राण-प्रतिष्ठा पूर्ण हुई। pic.twitter.com/4hhNm2MDoS
— Danish Kaneria (@DanishKaneria61) January 22, 2024
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) సైతం ప్రాణ ప్రతిష్ఠ వేడుక శుభాకాంక్షలు తెలిపాడు. ఐపీఎల్లో అలరించిన వార్నర్.. తెలుగు, హిందీ పాటలకు ఇన్స్టా రీల్స్ చేస్తూ భారత అభిమానుకులకు మరింత చేరువయ్యాడు.
ఇక హిందూ కుటుంబానికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) జై శ్రీరామ్ అనే క్యాప్షన్తో రాముడిపై పోస్ట్ పెట్టాడు. భారతీయ మూలాలున్న మహరాజ్కు శ్రీరాముడు అంటే అమితమైన భక్తి. వరల్డ్ కప్లో అతడు ఓం అని రాసున్న బ్యాటుతో కెమెరా కంట పడిన విషయం తెలిసిందే.
Jai Shree Raam 🙏 pic.twitter.com/4TBhsgC2th
— Keshav Maharaj (@keshavmaharaj16) January 22, 2024
సోమవారం మధ్యాహ్నం 12ః20 గంటలకు బాలా రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరిగింది. అనంతరం హెలిక్యాప్టర్లో రాముడి మందిరంపై పూల వర్షం కురిపించారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్లు హాజరయ్యారు.