భోపాల్: కునో నేషనల్ పార్కులో చీతా (Cheetah) కూనలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా (Jwala) అనే చీతా.. మూడు పిల్లలకు (Cubs) జన్మనిచ్చింది. ఈ సందర్భాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు. కొత్తగా పుట్టిన చిరుత కూనలకు సంబంధించిన అందమైన వీడియోని కూడా షేర్ చేశారు. తల్లి పొత్తిళ్లలో అవి ఆడుకుంటూ కనిపించాయి. 20 రోజుల క్రితం (ఈ నెల 3న) నమీబియా నుంచే తీసుకొచ్చిన ఆశా (Aasha) అనే చిరుత మూడు కూనలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
2023 మార్చిలో జ్వాలా చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కాగా, కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది.
కాగా, కునో నేషనల్ పార్క్లో చీతాలు ఒకటి తర్వాత మరొకటి చనిపోతున్నాయి. గత మంగళవారం (ఈ నెల 16) శౌర్య అనే చీతా మరణించింది. దీంతో నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందినట్టయ్యింది. వీటిలో 7 పెద్దవి, మూడు కూనలు ఉన్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్కు చీతాలను తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వదిలారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం ప్రారంభమైంది.
A Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs.
Union Environment Minister Bhupender Yadav shares the video on his ‘X’ handle. pic.twitter.com/dgOsISpTU0
— ANI (@ANI) January 23, 2024