Zomato | అయోధ్య (Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) వేళ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్వెజ్ (Non Vegetarian) డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసింది.
సోమవారం శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడు బాలావతారంలో కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలు రాష్ట్రాలు మాంసం విక్రయాలను నిషేధించాయి. ఈ నేపథ్యంలో నిన్న మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఓ కస్టమర్ చికెన్ కోసం జొమాటో యాప్లో వెతకగా.. నాన్వెజ్ ఫుడ్ అందుబాటులో లేదు.
దీంతో అతడు ‘ఈరోజు (సోమవారం) భోపాల్లో జొమాటో సంస్థ చికెన్ డెలివరీ చేయడం లేదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టుకు జొమాటో కూడా స్పందించింది. ప్రాణ ప్రతిష్ట వేళ ప్రభుత్వ ఆదేశాల మేరకు నాన్ వెజ్ను తాత్కాలికంగా నిషేధించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాన్వెజ్ను డెలివరీ చేయట్లేదని స్పష్టం చేసింది.
Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps!
— zomato care (@zomatocare) January 22, 2024
Also Read..
PM Modi | ఈ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి.. ప్రాణప్రతిష్ట వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
Amitabh Bachchan | రామచంద్రకీ జై.. బాలరాముడి దర్శన ఫొటోలను షేర్ చేసిన బిగ్బీ
IndiGo | కోల్కతా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. జైపూర్కు మళ్లింపు