Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆతర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ వెంటనే లోక్ సభ (Lok Sabha)ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదేవిధంగా రాజ్యసభ (Rajya Sabha ) కూడా వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
Also Read..
Landslide | ఘోర ప్రమాదం.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి
Minister KTR | మోదీజీ.. అమిత్ జీ ఎక్కడున్నారు..? మణిపూర్ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్