P Chidambaram | 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో హస్తం పార్టీ ఉంది. ఇందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికలకు కీలకమైన మేనిఫెస్టో రూపకల్పనకు కమిటీని (Congresss Manifesto Committee) వేసింది. 16 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి చైర్మన్గా పార్టీ సీనియర్ నేత పి.చిదంబరాన్ని (P Chidambaram) నియమించింది.
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఖరారు చేసే ఈ కమిటీకి ఛత్తీస్గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్దేవ్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్, శశిథరూర్, లోక్ సభలో పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్, ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాం గమ్, ఇమ్రాన్ ప్రతాప్గఢీ, కె.రాజు, ఓంకార్ సింగ్ మార్కమ్, రంజీత్ రంజన్, జిగ్నేశ్ మేవాణీ, గుర్తీప్ సప్పల్లు కమిటీ సభ్యులుగా ఉన్నారు.
Also Read..
Dense Fog | ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. ఆధ్వాన్నంగా గాలి నాణ్యత.. ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు
Coronavirus | ఏడు నెలల గరిష్ఠానికి కరోనా కేసులు.. కొత్తగా 756 మందికి పాజిటివ్
Lift Crashes | 8వ అంతస్తు నుంచి పడిపోయిన లిఫ్ట్.. తొమ్మిది మంది ఐటీ ఉద్యోగులకు గాయాలు