Lift Crashes | ఉత్తరప్రదేశ్ (UP) నోయిడా (Noida)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్లోని లిఫ్ట్ 8వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది (Lift Crashes). ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఉన్న తొమ్మిది మంది ఐటీ ఉద్యోగులకు (Techies) తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఐదుగురిని ఐసీయూ (ICU)లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 125 లో రివర్ సైడ్ టవర్ (River Side Tower) బిల్డింగ్లో శుక్రవారం సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బిల్డింగ్లోని 8వ ఫ్లోర్లో ఎరాస్మిత్ టెక్నాలజీస్ (Erasmith Technologies) అనే ఐటీ కంపెనీ ఉంది. ఆ సంస్థలో పనిచేస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులు విధులు ముగించుకొని కిందకు దిగేందుకు లిఫ్ట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఉన్నట్టుండి లిఫ్ట్ ఒక్కసారిగా 8వ అంతస్తు నుంచి కిందకుపడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది టెకీలూ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిని పీయూష్ శర్మ (22), అభిషేక్ పండిట్ (23), అభిషేక్ గుప్తా (24), సౌరభ్ కటియా (28), రజత్ శర్మ (29), శుభం భరద్వాజ్ (22), యషు శర్మ (23), సాగర్ ( 25), అభిజీత్ సింగ్ (23) గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Dense Fog | ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. ఆధ్వాన్నంగా గాలి నాణ్యత.. ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు
Coronavirus | ఏడు నెలల గరిష్ఠానికి కరోనా కేసులు.. కొత్తగా 756 మందికి పాజిటివ్
Tamil Nadu | పొంగిపొర్లుతున్న శ్రీవైకుంఠం మెట్టు డ్యాం .. వీడియోలు