Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిగా తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది.
మహాకుంభమేళా మరో 16 రోజుల్లో ముగియనుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. రోజూ లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల వరకూ ఏకంగా 74.96 లక్షల మంది సంగమంలో నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తాజాగా ప్రకటించింది. ఇక మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 45 కోట్ల మంది యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించింది.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది.
Also Read..
Hydrogen Train | భారత్ తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది..! ట్రైన్ ప్రత్యేకతలు ఇవే..!
Ayodhya Ram Temple | మహాకుంభమేళా ఎఫెక్ట్.. అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ