న్యూఢిల్లీ: ఢిల్లీలో విపక్ష ఎంపీలు ఇవాళ తిరంగా మార్చ్(Tiranga March) నిర్వహించారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు. ఉదయం లోక్సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత .. విపక్ష ఎంపీలు విజయ్ చౌక్ వరకు ర్యాలీ తీశారు. జాతీయ జెండాలు పట్టుకుని ఎంపీలు అంతా ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంట్ను ప్రభుత్వమే నడపడం లేదని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ అన్నారు. అదానీ స్కామ్ విషయాన్ని ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో.. బడ్జెట్ సమావేశాలు మొత్తం వాయిదాలతోనే ముగిశాయి.
#WATCH | Opposition MPs take out ‘Tiranga March’ from Parliament to Vijay Chowk, on the last day of the Budget session of Parliament in Delhi pic.twitter.com/ljvbnlN1ec
— ANI (@ANI) April 6, 2023