ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రూ.400 కోట్ల మేర బడ్జెట్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఈ సినిమా షూటింగ్ను ముంబై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ పెరగకుండా ఉండేందుకు ప్రభాస్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ చిత్ర షూటింగ్ మొన్నటి వరకు కూడా ముంబైలోనే జరిగింది. దాదాపు రెండు నెలలు అక్కడ పూర్తి చేసిన తర్వాత కరోనా కారణంగా హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఇక్కడ మరో మూడు నెలల షూటింగ్ చేయనున్నారు దర్శక నిర్మాతలు. అయితే షిఫ్టింగ్ చేసినపుడు నిర్మాతలకు అదనపు ఖర్చులు చాలా ఉంటాయి. బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది. ఈ విషయంలో ప్రభాస్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఆదిపురుష్ బడ్జెట్ పెంచకుండా ప్రభాస్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపు గ్రీన్ మ్యాట్ లోనే జరగబోతుందని తెలుస్తుంది. ఫైట్స్ నుంచి మొదలు పాటలు, సన్నివేశాలు అన్నీ విజువల్ గ్రాండియర్తోనే చూపించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఈయన గత సినిమా తానాజీ కంటే కూడా పదిరెట్లు గ్రాండ్ గా ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుకుంటూ సినిమాను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు. ఇప్పటి వరకు ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు. ఈ మధ్యే హీరోయిన్ కృతి సనన్ కూడా జాయిన్ అయింది. త్వరలోనే ప్రభాస్, కృతి కాంబినేషన్ లో ఓ భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండే పాటను చిత్రీకరించబోతున్నాడు ఓం రౌత్.
ఈ చిత్ర షూటింగ్ 2021లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు. అలా అయితేనే పోస్ట్ ప్రొడక్షన్ కోసం కనీసం ఆర్నెళ్లు సమయం తీసుకుని 2022 ఆగస్టుకు విడుదల చేయగలరు. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లని ప్రచారం జరుగుతుంది. అందులో 60 శాతం అంటే దాదాపు 250 కోట్లకు పైగా గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు చూడనటువంటి భారీ విజువల్ మైథలాజికల్ వండర్ ను ఆదిపురుష్తో చూపించాలని ఫిక్స్ అయిపోయాడు ఓం రౌత్. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్తో మూవీ పక్కా అంటున్న బండ్ల గణేష్..!
అందరిలానే నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి: శృతి హాసన్
కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సోనూసూద్
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత
మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్
అమ్మకు పాజిటివ్ అంటూ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ విన్నర్
సోషల్ మీడియాలో రత్తాలు రచ్చ.. మండిపడుతున్న నెటిజన్స్