కరోనా సెకండ్ వేవ్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు కోలుకోగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఎంతో జాగ్రత్తగా ఉండే వారికే కరోనా వస్తుంటే మా పరిస్థితేంటని సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ తన తల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. కుటుంబ సభ్యులందరికి నెగెటివ్ రాగా, అమ్మకు పాజిటివ్ అని వచ్చింది. సీటీ లెవల్స్ బాగుండడం కొంత ఊరటనిచ్చే విషయం. అమ్మ త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాను. కరోనా మన మానసిక ధైర్యానికి పరీక్షగా నిలుస్తుంది. ఓ మనిషిని ఐసోలేషన్ పేరుతో రూంలో బంధించడం దారుణం. ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంత కన్నా ఎక్కువ మట్లాడదలచుకోలేదు అని అభి పేర్కొన్నారు. అభిజీత్ తల్లి త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ ప్రార్ధిస్తున్నారు.