NHAI | జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల (Two wheelers) నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందంటూ ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది. టూవీలర్స్కు టోల్ వసూలు వార్తలను ఖండించింది.
ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్పష్టతనిచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. టోల్ వసూలు ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. ‘భారత ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేయాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలను ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవు. అవన్నీ ఫేక్ వార్తలు’ అంటూ ఎన్హెచ్ఏఐ ఎక్స్ ద్వారా స్పష్టం చేసింది.
#FactCheck: Some sections of the media have reported that the Government of India plans to levy user fees on two-wheelers. #NHAI would like to clarify that no such proposal is under consideration. There are no plans to introduce toll charges for two-wheelers. #FakeNews
— NHAI (@NHAI_Official) June 26, 2025
జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ఫోర్ వీలర్స్, ఇతర పెద్ద వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల ఆటోలు టోల్ కట్టకుండానే జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నాయి. అయితే, ఈ విధానంలో మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల అంటే జులై 15 నుంచి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది.
Also Read..
Air India | ఎయిర్ ఇండియా విమానం రెక్కలో పక్షిగూడు.. VIDEOS
Two wheelers | ఇకపై ద్విచక్ర వాహనాలకూ టోల్ ఫీజు.. త్వరలో ప్రకటన..?
Reels | రీల్స్ పిచ్చి.. 13వ అంతస్తుపై నుంచి పడి యువతి మృతి