Mamata Banerjee | కాంగ్రెస్ (Congress) పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి చర్చలూ జరపలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని చెప్పారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ వెల్లడించారు.
మరోవైపు రాహుల్ యాత్ర (Rahul Yatra)పై కూడా దీదీ స్పందించారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్ యాత్రపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. రాష్ట్రం మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది.. అయినా మాకు సమాచారం ఇవ్వలేదు అని దీదీ కాంగ్రెస్పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read..
Ram Temple | అయోధ్య రాముడిని దర్శించుకున్న వానరం.. హనుమంతుడే వచ్చాడంటూ ట్రస్ట్ ట్వీట్
Ram Mandir | రామ మందిరానికి భారీ విరాళం అందించిన అంబానీ కుటుంబం..?
Ram Temple | అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. విధుల్లో 8 వేల మంది భద్రతా సిబ్బంది