Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది.
ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. పక్షి ఢీకొన్న (Bird Hit) ఆనవాళ్లు కూడా కన్పించలేదని నివేదికలో తెలిపింది. ‘విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంలో పక్షులు ఎగరలేదు. పక్షి ఢీ కొన్న ఆనవాళ్లు కూడా గుర్తించలేదు. వాతావరణ సంబంధిత సమస్యలు కూడా లేవు. ఆకాశం కూడా క్లియర్గా ఉంది. విజిబిలిటీ బాగుంది. గాలి స్వల్పంగా వీస్తోంది’ అని తెలిపింది. అంతేకాదు, ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. విమానంపై దాడి జరిగినట్లు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని వివరించింది.
కాగా, జూన్ 12న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుజరాత్లోని అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. దీంతో ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చాడని నివేదికలో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చారని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. ఈలోపే విమానం కూలిపోయిందని పేర్కొంది.
Also Read..
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై 15 పేజీల రిపోర్టు.. ఆ నివేదికలో ఇవే కీ పాయింట్స్
Chirag Paswan | నిన్ను చంపేస్తాం.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్కు బెదిరింపులు