పాట్నా: కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు (Chirag Paswan) చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా హత్య చేస్తామంటూ (Death Threat) ఓ దుండగుడు పోస్టు పెట్టారు. ఈ మేరకు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేశ్ భట్ పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘టైగర్ మెరాజ్ ఇడిసి’ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారని తెలిపారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హత్యా బెదిరింపులు కలకలం సృష్టించాయి.
అయితే చిరాగ్ పాశ్వాన్కు రోజురోజుకు ప్రజాధరణ పెరుగుతుండటంతోనే ఈ బెదిరింపు వచ్చిందని రాజేశ్ భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నదని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పాశ్వాన్కు హత్య బెదిరింపు వచ్చినట్లు జూలై 11న రాత్రి 9 గంటలకు పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందన్నారు. అయితే ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎలక్షన్స్లో తాను పోటీచేస్తున్నట్లు పాశ్వాన్ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.
🔴 Breaking News 🔴
Union Minister Chirag Paswan receives death threat LJP (Ram Vilas) files complaint at Cyber Police Station. Strong demand for strict action against the culprits.— Vihan Rathore (@Vihan_Rathor) July 11, 2025