జహీరాబాద్, జూన్ 25 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్)కు పరిశ్రమలు తరలిరానున్నాయి. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిమ్జ్లో అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ ట్రైటాన్ రూ.2100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకు రావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ట్రైటాన్ సంస్థ ప్రతినిధులు గురువారం హైదరాబాద్లో ఒప్పందం కుదుర్చుకున్న సం గతి తెలిసిందే. అమెరికాకు చెందిన ట్రైటాన్ లగ్జరీ కార్లు, ద్విచక్ర వాహనాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇంత పెద్ద కంపెనీ నిమ్జ్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో నిమ్జ్ ఏర్పాటుకు ప్రభుత్వం తొలి విడత భూసేకరణ పూర్తి చేసింది. భూసేకరణ చేసిన ప్రాంతంలో అమెరికాకు చెందిన ట్రైటాన్ సంస్థ శాశ్వత ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ట్రైటాన్ సంస్ధ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీగా ఎలక్ట్రిక్ వాహనాలను నిమ్జ్లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. పరిశ్రమ ఏర్పాటుతో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. మార్కెట్లో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో పాటు పర్యావరణ హితం కాబట్టి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మినహాయింపులు ఇస్తున్నది.
నిమ్జ్తో జహీరాబాద్కు ప్రపంచంలో గుర్తింపు..
జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్)ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జహీరాబాద్కు 9 కిలో మీటర్ల దూరంలో ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటు చేస్తున్నది. నిమ్జ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 12.635 ఎకరాల భూమిని సేకరిస్తున్నది. రూ.4.048 కోట్ల్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాథమికంగా అంచనా సిద్ధం చేసింది. నిమ్జ్ ప్రాజెక్టులో పారిశ్రామిక పెట్టుబడులు రూ.44.000 కోట్లు, పారిశ్రామిక ఉత్పాదన రూ. 117.570 కోట్లు, పర్యావరణ (సీఈఆర్) అభివృద్ధికి రూ. 28.24 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో నిమ్జ్ ఏర్పాటుకు ప్రభు త్వం ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేసింది. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి (నిమ్జ్) ఏర్పాటుకు ప్రభుత్వం న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో 12,635.14 ఎకరాలు భూమి సేకరించాలి. మొదటి విడత మౌలిక వసతులు సౌకర్యాలు వ్యవస్థాపకం చేసేందుకు (టీఎస్ఐఐసీ) భూ సేకరణ చేసింది. టీఎస్ఐఐసీ 2924.38 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంది. ఇందులో పట్టా భూమి 1371.24 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1613 ఎకరాలు ఉంది.
భూ సేకరణ చేసే గ్రామాలు ఇవే..
న్యాల్కల్ మండలంలోని 14 గ్రామాలు ఉన్నాయి. గణేశ్పూర్, హుస్సెల్లి, గుంజోటి, ముంగి, రుక్మాపూర్, హద్నూర్, న్యాతాబాద్, మామిడ్గి, కల్బేమాల్, బసంత్పూర్, మెటల్కుంట, గంగ్వార్, రేజింతల్, మల్కాన్పహాడ్ గ్రామాలు ఉన్నాయి. ఝరాసంగం మండలంలోని చీలేపల్లి, ఎల్గొయి, బర్థిపూర్ గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు.
గ్రామాలు తొలగించకుండా నిమ్జ్ ఏర్పాటు..
నిమ్జ్ ఏర్పాటు చేసే ప్రాంతంలో ముంగితండా, చంద్రానాయక్ తండా, సూర్యనాయక్తండా, (రుక్మాపూర్ తండా), చీలేపల్లి తండాలు ఉన్నాయి. ఈ తండాలను తొలగించకుం డా ప్రజలకు పునరావాసం కల్పించేందుకు బృహత్ ప్రణాళిక ఏర్పాటు చేశారు. తండాల పరిసరాల్లో నివాస ప్రదేశాలు, సామాజిక మౌలిక సదుపాయలు, హరిత ప్రదేశాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే స్థలం..
జహీరాబాద్కు ఉత్తరాన 9కిలో మీటర్ల దూరంలో ఉం టుంది. కర్ణాటకలోని బీదర్కు ఆగ్నేయంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాజెక్టు పరిధిలో ఎన్హెచ్-14, ఎన్హెచ్-16 రహదారులు ఉన్నాయి. వీటితోపాటు 65వ జాతీ య రహదారి (పుణె- మచిలీపట్నం రోడ్డు)10 కిలో మీటర్ల దూరంలో ఉంది. మెటల్కుంట రైల్వే స్టేషన్ 1.4కి.మీ దూరంలో ఉంటుంది.
జహీరాబాద్ నిమ్జ్లో ఏర్పాటు చేసే పరిశ్రమలు..
ఆటోమొబైల్, లోహాలు, విద్యుత్ యంత్ర సామగ్రి, యం త్ర పరికరాలు (మిషనరీ), ఆహార ప్రాసెసింగ్, లోహ- యేతర ఖనిజాలు, రవాణా పరికరాలు, వినియోగాలు, వసతి సౌకర్యాలు కలిపించే వాటిని ఏర్పాటు చేస్తున్నారు. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
రూ.4.048 కోట్లతో నిమ్జ్లో మౌలిక సదుపాయాలు..
నిమ్జ్లో మౌలిక సదుపాయలు కలిపించేందుకు ప్రభుత్వం రూ.4.048 కోట్లు వ్యయం చేయనుంది. పారిశ్రామిక పెట్టుబడులు రూ.44.000 కోట్లు, పారిశ్రామిక ఉత్పాదన రూ. 117.570 కోట్లు ఖర్చు చేస్తారు. నిమ్జ్లో 2.66లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిమ్జ్ ప్రాజెక్టులో కార్పొరేట్ పర్యావరణ బాధ్యతగా (సీఈఆర్) కోసం రూ.28.24 కోట్లు కేటాయించారు.
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే
జహీరాబాద్ నిమ్జ్లో అమెరికాకు చెందిన ట్రైటాన్ సంస్థ భారీగా పెట్టుబడులు పెటేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్రైటాన్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోవడంతో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనిం టి మాణిక్రావు కృతజ్ఞ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో వారు మంత్రిని కలసి సన్మానం చేసిన ధన్యవాదాలు తెలిపారు. నిమ్జ్తో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు.
పారిశ్రామికంగా జహీరాబాద్ అభివృద్ధి
జహీరాబాద్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిమ్జ్, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం మంజూరు చేశా రు. నిమ్జ్లో అమెరికాకు చెం దిన ట్రైటాన్ సంస్థతో పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉంది. తద్వా రా స్థానికులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సంగమేశ్వర ఎత్తిపోతలతో జహీరాబాద్ నియోజకవర్గంలో 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అంది సస్యశ్యామలం కానున్నది. వ్యవసాయ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే నిరుద్యోగ సమస్య ఉండదు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు.
-కొనింటి మాణిక్రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే