Ayodhya | అయోధ్య (Ayodhya)లో బాలరాముడి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నుంచి రామ్లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. బాలరాముడి దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీని అదుపు చేసేందుకు లక్నో నుంచి బస్సు సర్వీసులను నిలిపివేశారు (No Buses).
భక్తుల రద్దీ దృష్ట్యా లక్నో నుంచి అయోధ్యకు బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యూపీఎస్ఆర్టీసీ అధికారులు బుధవారం ప్రకటించారు. ప్రైవేటు వాహనాలను కూడా నగరంలోకి అనుమతించడం లేదని తెలిపారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్దరిస్తామని వెల్లడించారు.
మరోవైపు మంగళవారం తొలిరోజు సుమారు 5లక్షల మంది భక్తులు రామ్లల్లాను దర్శించుకోగా.. మరో 3 లక్షల మంది శ్రీరాముడి దర్శనం కోసం వేచిఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం కూడా ఆయలంలో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజూ సుమారు లక్ష మంది శ్రీరాముడిని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
Ram Temple | అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. విధుల్లో 8 వేల మంది భద్రతా సిబ్బంది
Ram Temple | అయోధ్య రాముడిని దర్శించుకున్న వానరం.. హనుమంతుడే వచ్చాడంటూ ట్రస్ట్ ట్వీట్
Ram Mandir | రామ మందిరానికి భారీ విరాళం అందించిన అంబానీ కుటుంబం..?