Nipah virus | కేరళ (Kerala) లో కలకలం రేపిన ప్రాణాంతకమైన నిఫా వైరస్ (Nipah virus) ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో కేరళ విపత్తు నిర్వహణ విభాగం (District Disaster Management Department) ఆంక్షలను సడలించింది (Restrictions Eased).
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోజికోడ్ (Kozhikode ) జిల్లాలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలను మూసివేసింది. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 16వ తేదీ నుంచి ఆయా ప్రాంతాల్లో ఒక్క నిఫా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకూ కాంటాక్ట్ లిస్టు జాబితాలోని 218 మంది శాంపిళ్లను పరీక్షించగా అన్నీ నెగటివ్గానే వచ్చాయి. దీంతో కోజికోడ్ జిల్లాలోని 53 వార్డులు, పంచాయతీల్లో ఆంక్షలను సడలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తాజాగా ప్రకటించింది.
ఇకపై కంటైన్మెంట్ జోన్లలోని (Containment Zones) షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉండొచ్చని తెలిపింది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల వరకూ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణకు అనుమతించింది. అయితే, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం మాత్రం యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. ప్రజలు గుమికూడటంపై మునుపటి నిబంధనలే అమల్లో ఉంటాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.
Also Read..
Lok Sabha | లోక్సభ రేపటికి వాయిదా
Naga Chaitanya | త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయనున్న నాగచైతన్య – శోభిత..!
Jawan Movie | షారుఖ్ సర్తో మాట్లాడి.. జవాన్ చిత్రాన్ని ఆస్కార్కి తీసుకెళ్తా : దర్శకుడు అట్లీ