నాగర్ కర్నూల్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్( SIR ) లో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) సూచించారు. తెల్కపల్లి మండల బూత్ లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 86 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయిందని, మిగిలిన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపి బీఎల్వో (BLO )తో డిజిటల్ చేయించాలని కోరారు.
వచ్చే నెల 3 వ తేదీ తర్వాత డ్రాఫ్ట్ లిస్టును పరిశీలించి ఇంకా రాని ఓట్లను, కొత్త ఓటర్ల ను,మ్యాపింగ్ కానీ ఓటర్లకు వచ్చే నోటీసులపై దృష్టి పెట్టాలని సూచించారు. చనిపోయిన ఓటర్ల వివరాలు, పర్మనెంట్ షిప్టింగ్ ఓటర్ల వివరాలు జాగ్రతగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షలో బీఎల్ఏలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు .