Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists), పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో లేంద్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా)కి చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
Also Read..
Finland: ఫిన్ల్యాండ్లో స్కూల్ వద్ద కాల్పులు.. ముగ్గురు పిల్లలకు గాయాలు
Arvind Kejriwal | తీహార్ జైల్లో.. యోగా, బ్రెడ్-టీతో రోజును ప్రారంభించిన కేజ్రీవాల్