ఇంఫాల్: మణిపూర్లో తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మణిపూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గురువారం ముఖ్యమంత్రి బీరేన్సింగ్ అధ్యక్షతన సమావేశమైన కొవిడ్-19 సంప్రతింపుల కమిటీ రాష్ట్రంలో లాక్ విధించాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ఈ రోజు నుంచే కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని, ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని మణిపూర్ సీఎస్ రాజేశ్ కుమార్ తెలిపారు. కానీ ఎన్ని రోజుల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టంచేయలేదు. కాగా, మీడియా సంస్థలకు, టెలికాం సంస్థల సేవలకు, ఇతర అత్యవసర సేవలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మాకు మెడిసిన్ పనిచేయదు.. పెగ్గే పని చేస్తుంది.. వీడియో
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య