న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. దాంతో ఢిల్లీలో మందుబాబులు వైన్స్ల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ వైన్ షాపు దగ్గరకు మద్యం కోసం వచ్చిన వృద్ధురాలిని మీడియా ప్రతినిధులు పలుకరించారు. ఆరు రోజులు లాక్డౌన్ అనగానే కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా వైన్ షాపుల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు కదా.. వారం రోజులు మద్యం లేకుండా ఉండలేరా అని ప్రశ్నించారు.
మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సదరు వృద్ధురాలు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మెడికల్ షాపులలో దొరికే మందుల కంటే తమకు వైన్స్లలో దొరికే మందులే బాగా పనిచేస్తాయన్నారు. తమకు ఇంజెక్షన్లతో ఉపయోగం ఉండదని, ఆల్కహాల్ మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే తమకు వైద్యులు ఇచ్చే మందుల కంటే వైన్స్లో ఇచ్చే పెగ్గులే బాగా పని చేస్తాయని చెప్పారు.
మద్యం తాగితే కరోనా టీకా వేయించుకోవాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్నకు.. టీకా వేయించుకోవాలిగానీ వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని అర్థం కానీ సమాధానం చెప్పారు. తాను గత 35 ఏండ్లుగా మద్యం సేవిస్తున్నానని, దానివల్ల ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య