NIA Raids | ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) అణచివేత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దేశవ్యాప్తంగా దాడులు (NIA Raids) కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు.. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, గత శనివారం ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్ర, కర్ణాటకలో 44 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని థానే, పుణే జిల్లాలతోపాటు కర్ణాటకలోని బెంగళూరులో శనివారం దాడులు నిర్వహించారు. ఒక థానే జిల్లాలోనే ఏకంగా 41 చోట్ల సోదాలు జరిగాయి. దాడుల్లో పెద్దఎత్తున నగదు, ఆయుధాలు, స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఐసిస్ మాడ్యూల్ నేత సాకిబ్ నాచన్తోపాటు ఐసిస్తో సంబంధాలు ఉన్న 15 మందిని అరెస్టు చేశారు.
The National Investigation Agency is conducting searches over half a dozen locations in Bengaluru in a terror conspiracy case. pic.twitter.com/az1k80U07m
— ANI (@ANI) December 13, 2023
Also Read..
Mohan Yadav | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణం
Parliament attack | పార్లమెంట్పై ఉగ్రదాడికి 22 ఏళ్లు.. అమరులకు నివాళులర్పించిన నేతలు
KTR | హైదరాబాద్ను మరో మెట్టు ఎక్కించాల్సిన బాధ్యత వాళ్లదే : కేటీఆర్