Mohan Yadav | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan Yadav) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్లో గవర్నర్ మంగుభాయ్ (Mangubhai ) ఆయనతో ప్రమాణం చేయించారు. ఇదే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులుగా రేవా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మాజీ మంత్రి జగదీశ్ దేవరా ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు భోపాల్లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు మోహన్ యాదవ్. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పండిత్ దీన్దయాళ్ఉపాధ్యాయ్, శ్యామా ప్రసాద్ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
#WATCH | BJP leader Mohan Yadav takes oath as the Chief Minister of Madhya Pradesh.
Prime Minister Narendra Modi and other senior NDA leaders attend the ceremony. pic.twitter.com/aXWZMPyXBH
— ANI (@ANI) December 13, 2023
BJP leaders Jagdish Devda and Rajendra Shukla take oath as the Deputy Chief Ministers of Madhya Pradesh, in Bhopal.
Prime Minister Narendra Modi and other senior NDA leaders attend the ceremony. pic.twitter.com/dZbni3CiLK
— ANI (@ANI) December 13, 2023
ప్రముఖ నేతలను పక్కకు నెట్టి..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎవరి పేరును ప్రకటించలేదు. దీంతో ప్రస్తుతం సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అప్పట్లోనే పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సీఎం పదవి చేపట్టాలని తన వంతు ప్రయత్నాలు చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా సీఎం కుర్చీ కోసం పావులు కదిపారు. ఇందుకు అనుగుణంగానే సీఎం రేసులో చౌహాన్, సింధియా, తోమర్, ప్రహ్లాద్ పటేల్ సహా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వారందరినీ బీజేపీ అధిష్ఠానం పక్కనపెట్టి రేసులో అసలు పేరే వినిపించని, కొత్త వ్యక్తికి సీఎంగా అవకాశం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
విద్యార్థి నాయకుడి నుంచి సీఎం స్థాయి దాకా..
58 ఏండ్ల మోహన్ యాదవ్ 2013లో ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2018లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2020, జూలైలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై దాదాపు 13 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వ్యాపారవేత్త కూడా అయిన మోహన్ యాదవ్ బీజేపీతో చాలా ఏండ్లుగా అనుబంధం ఉన్నది. గతంలో విద్యార్థి నేతగా కూడా పనిచేశారు.
Also Read..
Parliament attack | పార్లమెంట్పై ఉగ్రదాడికి 22 ఏళ్లు.. అమరులకు నివాళులర్పించిన నేతలు
Viral Video | రన్నింగ్ ఆటోలో విన్యాసాలు ప్రదర్శిస్తూ.. సైక్లిస్ట్ను ఢీ కొట్టిన యువకుడు
Samantha | సమంత ఇంట మొదలైన క్రిస్మస్ సందడి.. పిక్స్ షేర్ చేసిన నటి