చెన్నై: త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందాన్ని ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలైన అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకేకు 18, టీటీవీ దినకరన్కు చెందిన ఏఎంఎంకేకు 11 సీట్లు కేటాయించారు.
కాగా, ఎన్డీయే కూటమిలో అంతర్గత చర్చలు సజావుగా సాగాయని అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) తెలిపారు. సీట్ల కేటాయింపులు అధికారికంగా ఖరారయ్యాయని చెప్పారు. ఇతర పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని, వారికి కేటాయించే సీట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఎన్డీయేను ‘విజయ కూటమి’గా ఆయన అభివర్ణించారు. అన్ని సీట్లలో విజయం సాధించి, ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డీఎంకే-కాంగ్రెస్ కూటమిని తిరస్కరిస్తారని బీజేపీ తమిళనాడు ఇన్చార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఢిల్లీలో మాదిరిగానే తమిళనాడు ఓటర్లు ఎన్డీయేను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడును అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిన దుష్ట శక్తి అయిన డీఎంకే, దాని భాగస్వాములకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
Also Read:
Kashmiris Donations To Iran | కశ్మీర్ ప్రజల విరాళాలు.. ఈ దయ మరువలేనిదన్న ఇరాన్
Watch: ఆలయంలో రెచ్చిపోయిన పూజారులు.. భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు