Jitendra Awhad | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరాముడు ‘మాంసాహారి’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో తనపై వచ్చిన విమర్శలు, ఆయన చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కొంత మంది మనోభావాలను దెబ్బ తీసిందని తెలిసిబాధగా అనిపించిందన్నారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు.
అయితే, రాముడు మాంసాహారి అని తాను చెప్పింది సొంత వ్యాఖ్యలేమికావని.. వాల్మీకి రామాయణంలోనే రాసి ఉందన్నారు. 1891 నాటి అధికారిక ప్రతిని కోల్కత్తా ఐఐటీ కాన్పూర్లో ప్రింట్ చేశారన్నారు. ఈ విషయంలో చాలా రీసెర్చ్ జరిగిందన్న ఆయన.. అదే తాను ఇవాళ ప్రజల ముందుంచానన్నారు. తాను చెప్పినదంతా 1891 నాటి పుస్తకంలో రాసి ఉందని.. ఆ పుస్తకాన్ని నేనేమీ రాయలేదన్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే తాను విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. 22 వరకు ఎలాంటి లాజిక్పై చర్చ ఉండదని.. భావోద్వేగాలపైనే చర్చ ఉంటుందన్నారు. తనపై దాఖలైన ఫిర్యాదుపై.. ఎలాంటి ఎఫ్ఐఆర్కు భయపడేది లేదని చెప్పారు.
#WATCH | On his “non-vegetarian” comment on Lord Ram, NCP-Sharad Pawar faction leader Jitendra Awhad says, “I express regret. I did not want to hurt anyone’s sentiments.” pic.twitter.com/wFIAXQXAKb
— ANI (@ANI) January 4, 2024