KTR | యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ నెల 9వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో పర్యటించనున్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని కోరుతూ చేపట్టే బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. అనంతరం కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు ముఖ్య నేతలు హాజరయ్యే ఈ ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.